బోనకల్లు, ఫిబ్రవరి 15 : విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. చిరునోముల ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించిన ఆయన తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిందని, ప్రతి పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ పేరుతో ప్రత్యేక వనరులు కల్పించిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేద విద్యార్థులే చదువుకుంటారని, వారికి అర్థమయ్యే విధంగా బోధించి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బంధం శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, బొగ్గుల భాస్కర్రెడ్డి, కనుమూరి వెంకటేశ్వరరావు, గరపాకుల రామకృష్ణ, హెచ్ఎం, ఉపాధ్యాయుడు సీతారామశాస్త్రి తదితరులు ఉన్నారు.