ఖమ్మం, సెప్టెంబర్ 29 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఐకాన్గా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా కోట్లాది రూపాయల నిధులను పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సర్కారు వరదలా పారించింది. ఏళ్లతరబడి చూడని అభివృద్ధిని తరాలకు గుర్తుండిపోయేలా.. చరిత్రలో నిలిచిపోయేలా సీఎం కేసీఆర్ పాలనలో కళ్లముందు సాక్షాత్కరింపజేసింది. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శనివారం ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు తదితర ప్రజాప్రతినిధులు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజవర్గాల్లో శనివారం రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పర్యటించి పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో మరో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి నేరుగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చేరుకుంటారన్నారు. తొలుత గుబ్బగుర్తి ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారన్నారు. తర్వాత ఖమ్మం నగరానికి విచ్చేసి లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్, ఎస్బీఐటీ కళాశాల సమీపంలో మున్సిపల్ స్పోర్ట్స్ పార్క్, గోళ్లపాడు చానెల్పై నిర్మించిన పార్క్లు, వీడివోస్ కాలనీలో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్లను ప్రారంభిస్తారన్నారు.
కాల్వొడ్డులోని మున్నేరు వద్ద తీగల వంతెన, నగరంలో పలుచోట్ల డ్రైనేజీ పనులను శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం నగరంలో నిర్వహించనున్న ప్రగతి నివేదిన సభలో పాల్గొంటారన్నారు. సభ తర్వాత భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం పట్టణానికి మంత్రి కేటీఆర్ చేరుకుని సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభిస్తారన్నారు. అనంతరం మీడియో సమావేశం ఉంటుందన్నారు. అనంతరం సత్తుపల్లికి చేరుకుని పలు అభివృద్ధి పనులను ప్రారంభించి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారన్నారు. పర్యటనలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కన్నం వైష్ణవి, పగడాల శ్రీవిద్య, పాలెపు విజయ, మందడపు లక్ష్మి పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూల్
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు తదితరులు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.
ఉదయం 8 గంటలకు : మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి తొలుత కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్లో దిగుతారు. అక్కడ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా ఖమ్మంలోని మమత ఆస్పత్రికి 9.20 గంటలకు చేరుకుంటారు.
9.45 గంటలకు లకారం ట్యాంక్ బండ్కు చేరుకొని ఎన్టీఆర్ మున్సిపల్ పార్క్ను ప్రారంభిస్తారు. అండర్ డ్రైనేజీ మురుగు కాలువ నిర్మాణానికి, అమృత్ పథకం-2 అండర్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
10 గంటలకు రామచంద్రయ్య నగర్లో నిర్మించిన కేఎంసీ స్పోర్ట్స్ పార్క్ను ప్రారంభిస్తారు.
10.15 గంటలకు ప్రకాశ్నగర్ చేరుకొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్క్ను ప్రారంభిస్తారు. గోళ్లపాడ్ ఛానల్ ఆండర్ గ్రౌండ్ పైపులైన్ నిర్మాణాలను ప్రారంభిస్తారు.
10.45 గంటలకు కాల్వొడ్డుకు చేరుకొని మున్నేరు రివర్ ఫ్రంట్ తీగల వంతెనకు, ఆర్సీసీ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
11.15 గంటలకు వీడీవోస్ కాలనీకి చేరుకొని సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ను ప్రారంభిస్తారు.
11.30 గంటలకు కేఎంసీ కార్యాలయానికి చేరుకొని ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న రోడ్లకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రగతి నివేదన సభలో పాల్గొంటారు. 12 గంటలకు మమత ఆస్పత్రిలోని హెలిపాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్లో భద్రాచలం వెళ్తారు.
భద్రాచలంలో…