సత్తుపల్లి:సత్తుపల్లిలోని శ్రీబండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న ఈఅండ్సీటీ, హిందీ సబ్జెక్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. హిందీ సబ్జెక్టుకు పీజీలో 50శాతం కంటే ఎక్కువ, ఈఅండ్సీటీకి బీటెక్ లేదా ఎంటెక్లో 50శాతం ఎక్కువ మార్కులు పొంది ఉండాలన్నారు.
లోకల్ అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తుతో పాటు పీజీ మెమో, 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్కార్డు జిరాక్స్లతో ఈనెల 21 సాయంత్రంలోగా కళాశాలలో సంప్రదించాలని కోరారు. బాలికల జూనియర్ కళాశాలలో… సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జంతుశాస్త్రం(తెలుగు, ఆంగ్ల మాద్యమాలకు) గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తెలిపారు. అర్హత, ప్రతిభ, అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుందని, ఈనెల 22 సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులను స్థానిక కళాశాలలో అందించాలని సూచించారు.