కారేపల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకానికి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డీ.అక్తర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8వతరగతి గణితం బోధించేందుకు బీఎస్సీ, బీఈడీ అర్హత కల్గిన వారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి కల్గిన వారు ఈనెల 30న పాఠశాలలో డెమో క్లాసుకు హాజరు కావాలని ఆయన కోరారు.