ఖమ్మం : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 76 కేంద్రాలలో పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోపలికి అనుమటించరు. ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేయాలని ఇంటర్మీడియట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందుకోసమే విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.