ఇల్లెందు రూరల్, మే 22: ఇల్లెందు చరిత్రను, ముఖచిత్రాన్ని మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమని అన్నారు. మండలంలోని కొమరారం గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు శీలం రమేశ్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇల్లెందు దుస్థితి ఎలా ఉండేదో, స్వరాష్ట్రంలో ఎలా అభివృద్ధి చెందిందో ఇక్కడి ప్రజలకు తెలుసునని అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధితో ఇల్లెందు నియోజకవర్గ ముఖచిత్రమే మారిపోయిందని అన్నారు. ఇల్లెందు మండలంలో రూ.278.18 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అన్నారు. అందుకే మండలంలోని 9,968 మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ.122 కోట్లను అందించారని అన్నారు. జాతీయ స్థాయిలో పార్టీ పెట్టిన కొద్దిరోజుల్లోనే ళబీఆర్ఎస్ను ఇతర రాష్ర్టాల ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. బీఆర్ఎస్ను విమర్శిస్తున్న వారిని ప్రజలు గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బాణోత్ హరిసింగ్నాయక్, దిండిగాల రాజేందర్, పులిగళ్ల మాధవరావు, ఖమ్మంపాటి రేణుక, కుంజా కృష్ణ, జనగం కోటేశ్వరరావు, మంకిడి కృష్ణ, దాస్యం ప్రమోద్, బండారి కృష్ణ, నెమలి ధనలక్ష్మి, మల్సూరు, నాదెండ్ల శ్రీనివాస్, లస్కర్, దేవ్లా తదితరులు పాల్గొన్నారు.