ఖమ్మం : డిగ్రీ అనంతరం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్ష శుక్రవారంతో ముగిసింది. మూడు సెషన్లలో నిర్వహించిన పరీక్ష ఈ నెల 19వ తేదీన రెండు సెషన్లు, 20వ తేదిన ఉదయం నిర్వహించిన సెషన్తో ఐసెట్ ప్రశాంతంగా ముగిసినట్లు కన్వీనర్ ప్రోఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరిగిన పరీక్షల్లో 1129 మంది విద్యార్థులకు 986 మంది విద్యార్ధులు హజరవ్వగా..143 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
మొత్తం 87.33శాతం హజరు నమోదు అయ్యింది. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించే సమయంలో ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేశారు. పరీక్ష కేంద్రాల్లో అబ్జర్వర్లు పరీక్షలు జరుగుతున్న తీరును పరీశీలించారు.