ఖమ్మం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటడంతో తుపాన్గా మారింది.దీంతో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 62.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గరిష్టంగా రికార్డు స్థాయిలో వైరా మండలంలో జిల్లాలోనే అత్యంతగా 126.8 మిల్లీమీటర్లు కురిసింది.
కొణిజర్ల మండలంలో 111.4 మి.మీ, కామెపల్లి మండలంలో 107.2 మి.మీ, సింగరేణి మండలంలో 96.2 మి.మీ, మధిర మండలంలో 90 మి.మీ, బోనకల్ మండలంలో 91.4 మి.మీ, రఘునాథపాలెం మండలంలో, చింతకాని మండలంలో 71.4, మి.మీ, 70.6 మి.మీ, సత్తుపల్లి మండలంలో 66.8 మి.మీ, 64.2 మి.మీ, ఖమ్మం రూరల్ మండలంలో 51.4 మి.మీ, ఖమ్మం అర్బన్ మండలంలో 50 మి.మీ, పెనుబల్లి మండలంలో 36.2 మి.మీ, ముదిగొండ మండలంలో 28.2 మి.మీ, తిరుమలయపాలెం 35.2 మి.మీ, నేలకొండపల్లి మండలంలో 26.2 మి.మీ, కూసుమంచి మండలంలో 16.2, కల్లూరు మండలంలో 12.8 మి.మీ, ఏన్కూర్ మండలంలో 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.