మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లెందులపాడు 4వ వార్డులో సోమవారం దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత ఆధ్వర్యంలో వైద్యశిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని
మధిర మున్సిపల్ కమీషనర్ రమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లతజయాకర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు.
అనంతరం గ్రామంలోని ఎస్సీకాలనీలో జ్వరాలు ఉన్న వారికి బ్లడ్శాంపిల్స్ తీసి ఖమ్మంలో టీ హబ్ ల్యాబ్కు పంపించారు. ఈ కార్యక్రమంలో హెల్త్సూపర్వైజర్ లంకా కొండయ్య, హెల్త్ విజిటర్ కాంతలీల, సూపర్వైజర్ సుబ్బలక్ష్మీ, స్టాఫ్నర్సు అనూష, ఏఎన్ఎం రాజేశ్వరి, బీ.అరుణ, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.