ఎర్రుపాలెం, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అద్భుత పథకాల వల్లనే తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమించిన కేసీఆర్ తెలంగాణకు అభినవ గాంధీలా నిలిచారని అభివర్ణించారు. మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని మామిడితోటలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమావేశంలో తాతా మధు మాట్లాడారు.
గ్రామాల్లో కార్యకర్తలతో సమన్వయ కమిటీలు వేసి టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 60 ఏళ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఆరేళ్లలోనే చేసి చూపించిన విధానాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ వృద్ధాప్య పింఛన్లు రూ.వందల్లోనే అందుతున్న విషయాన్ని, అది కూడా అరకొరగా ఇస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అదే సమయంలో తెలంగాణలో అధికంగా అందుతున్న పింఛన్ గురించి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
శ్రేణులకు కూడా తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తదుపరి ఎన్నికల్లోనూ రాష్ట్రంలో టీఆర్ఎస్దే అధికారం తదుపరి ఎన్నికల్లోనూ రాష్ట్రంలో టీఆర్ఎస్దే అధికారమని స్పష్టం చేశారు. అనంతరం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇక్కడి ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క తన గొప్పగా చెప్పుకుంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అమల్లోకి తెచ్చిన అద్భుత పథకం దళితబంధు అని అన్నారు. కానీ దీని అమలును భట్టి విక్రమార్క తన గొప్పగా చెప్పుకుంటుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు రంగిశెట్టి కోటేశ్వరరావు, చావా రామకృష్ణ, చిత్తారు నాగేశ్వరరావు, దేవరకొండ శిరీష, శీలం కవిత, పంబి సాంబశివరావు, మొండితోక జయాకర్, కోన నరేందర్రెడ్డి, బాలరాఘవరెడ్డి, రామిశెట్టి సుజాత, మొగిలి అప్పారావు, శీలం ఉమామహేశ్వరి, కొండేపాటి సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, రేణుకకృష్ణారెడ్డి, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.