సత్తుపల్లి : తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలం చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నర్సరీలను సిద్ధం చేయాలని ఎంపీడీవో చిట్యాల సుభాషిణి సూచించారు. సోమవారం మండల పరిధిలోని బుగ్గపాడు, కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ ప్రక్రియను పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి నర్సరీలో లక్ష మొక్కలు పెంచి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం దృష్టి సారించాలని సూచించారు. ఆమె వెంట ఈజీఎస్ ఏపీవో బాబూరావు, సర్పంచ్లు కారం జయేందర్రావు, కంచర్ల రమాదేవి, పూచి చిలకమ్మ, కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.