కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్
వైరా/ వైరా టౌన్/ కొణిజర్ల, జూన్ 16: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొణిజర్లకు చెందిన 16 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 12 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, సింగరేణి మండలానికి చెందిన 19 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఏన్కూరు మండలానికి చెందిన 17 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు.
ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు బొర్రా రాజశేఖర్, సైదులు, సూతకాని జైపాల్, బీడీకే రత్నం, నంబూరి కనకదుర్గా, ముళ్లపాటి సీతారాములు, దార్న రాజశేఖర్, బాణోతు సురేశ్, వై.చిరంజీవి, తోటకూర రాంబాబు, మల్లెల నాగేశ్వరరావు, పసుపులేటి మోహన్రావు, పోట్ల శ్రీనివాసరావు, డేరంగుల బ్రహ్మం, చెరుకుమల్లి రవి, కాటంరాజు, కిలారు మాధవరావు, గుగులోతు శ్రీను, అప్పం సురేశ్, మోటపోతుల సురేశ్, బాణోతు పద్మావతి, వాసిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.