కరకగూడెం, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలోని భట్టుపల్లి గ్రామ రైతువేదిక భవనంలో 54 మంది లబ్ధిదారులకు కల్యాణలక్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచి మేనమామలా ఆదరిస్తున్నారని, ఇలాంటి పథకం ఎక్కడాలేదన్నారు. మండలంలో అనేక మందికి పింఛన్లు అందిస్త్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి నిధులను అందిస్తున్నారని, బంగారు తెలంగాణే లక్ష్యంగా అన్ని వర్గాల అభ్యన్నతికి పాటుపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, జడ్పీటీసీ కొమరం కాంతారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, ఇన్చార్జ్ తహసీల్దార్ వినయశీల, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ప్రతి నిత్యం తిరుగుతూ వైద్య సేవలు అందిస్తున్న ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని రేగా అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంజూరు చేసిన స్మార్ట్ ఫోన్లను ఆశ కార్యకర్తలకు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేసిన వారి సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పర్షియానాయక్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పీహెచ్సీలో ప్రత్యేక వార్డు ప్రారంభించిన రేగా కరకగూడెం పీహెచ్సీలో రూ.10లక్షలతో రోగుల సౌకర్యార్ధం నిర్మించిన ప్రత్యేక వార్డును రేగా ప్రారంభించారు. వార్డు గదులను పరిశీలించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బూస్టర్ డోస్ను రేగా వేయించుకున్నారు.