సారపాక, మే 13: పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతున్న సారపాకలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సారపాక పట్టణంలో శనివారం పర్యటించిన ఆయన.. పలు కాలనీల్లో రూ.1.60 కోట్ల ప్రత్యేక నిధులతో చేపట్టిన 35 సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో పినపాక నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిందని అన్నారు. రూ.100 కోట్ల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఒకప్పుడు పల్లెలు, పట్టణాల్లో మట్టి రోడ్లు దర్శనమిచ్చేవని, తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగైందని అన్నారు. అంతర్గత రహదారులన్నింటినీ సీసీ రోడ్లుగా, బీటీ రోడ్లుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయన్నారు. జిల్లా అభివృద్ధితోపాటు పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులిస్తున్న సీఎం కేసీఆర్.. అభివృద్ధి ప్రధాతగా నిలిచారన గుర్తుచేశారు.
సీసీ రోడ్ల నిర్మాణ పనుల భూమిపూజకు వచ్చిన ప్రభుత్వ విప్ రేగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సారపాకలో పర్యటించారు. మండుటెండలోనూ బైక్పై పర్యటిస్తూ పట్టణమంతా తిరిగారు. ఈ సందర్భంగా కాంతారావుకు పట్టణ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. మహిళలు శాలువాలతో సత్కరించి, పూలదండలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తొలుత మద్ది బక్కారెడ్డి నివాసంలో అల్పాహారం స్వీకరించారు. భూమిపూజల అనంతరం బూర్గంపహాడ్లో చెన్నం సావిత్రమ్మ భౌతికకాయానికి నివాళులర్పించి ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు.
మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి శ్రీలత, బిక్కసాని శ్రీనివాసరావు, ముత్యాలమ్మ, గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, జక్కం సుబ్రహ్మణ్యం, కొర్సా లక్ష్మి, తుపాకుల రామలక్ష్మి, పోతునూరి సూరమ్మ, కొయ్యల పుల్లారావు, ఎల్లంకి లలిత, కొనకంచి శ్రీను, బెజ్జంకి కనకాచారి, గుల్ మహ్మద్, తిరుపతి ఏసోబు, బానోతు శ్రీను, సాబీర్పాషా, సానికొమ్ము శంకర్రెడ్డి, వారాల వేణు, గోనెల నాని, పూర్ణ, లక్ష్మీచైతన్యరెడ్డి, బాలాజీ, ఆంజనేయులు, మర్రి సాంబిరెడ్డి, సాలయ్య, పొడియం నరేంద్ర, తుపాకుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.