మణుగూరు టౌన్, ఆగస్టు 31: ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులకు భరోసానిస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. పట్టణంలోని మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన పలువురు లబ్ధిదారులకు రూ.69,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి మాట్లాడారు.
శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, ప్రమాదాల బారిన పడి చికిత్స పొందిన వారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, నాయకులు బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, వట్టం రాంబాబు, జావేద్ పాషా పాల్గొన్నారు.