సారపాక, మార్చి 14: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. మణుగూరులోని సింగరేణి అతిథిగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. జడ్పీటీసీలు పోశం నర్సింహారావు, కామిరెడ్డి శ్రీలత, సూదిరెడ్డి సులక్షణ, ఎంపీపీలు కారం విజయకుమారి, గుమ్మడి గాంధీ, కోండ్రు మంజుభార్గవి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వ విప్ కాంతారావు ఆదేశించారు. మణుగూరులోని సింగరేణి అతిథిగృహంలో పలు శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చించారు.