కల్లూరు, డిసెంబర్ 30 : నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను గ్రామాల్లోకి తీసుకువెళ్లి వారికి అందజేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. కల్లూరు రైతువేదికలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ముందుచూపుతోప్రజలకు ఉపయోగపడే పథకాలను ఏర్పాటు చేసి, ఆ పథకాల అమలులో అన్ని రాష్ర్టాల కంటే ముందున్నారని అన్నారు. నియోజకవర్గానికి రూ.17కోట్లు వెచ్చించి సీఎం సహాయనిధి చెక్కులను తీసుకువచ్చారన్నారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్, హరీశ్రావులను తీసుకువచ్చి ప్రారంభించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, జిల్లా, మండల రైతు బంధు సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, ఎంపీటీసీలు కొండూరి కిరణ్, లక్ష్మణ్రావు, ఎస్కె.కమ్లీ, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీడీవో రవికుమార్, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.
కేక్ను కట్చేసిన ఎమ్మెల్యే : కల్లూరు రైతువేదికలో ఎమ్మెల్యే సండ్ర శుక్రవారం అడ్వాన్స్గా కేక్ కట్చేసి నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 30 : కౌన్సిలర్ మట్టా ప్రసాద్, లింగపాలెంకు చెందిన ఎర్రా రమేశ్ ఆధ్వర్యంలో ముద్రించిన 2023 సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే సండ్ర శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎర్రా రమేశ్, మోరంపూడి ప్రసాద్, కృష్ణారావు, కొండపల్లి రమేశ్రెడ్డి, మందపాటి ప్రభాకర్రెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 30 : ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ(100) మృతికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం సంతాపం తెలిపారు. మోదీకి దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేసి ఆమె ఆత్మకు శాంతి కలగాలన్నారు.
తల్లాడ, డిసెంబర్30 : ప్రతి ఒకరూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడుచుకోవాలని, తోటి వారి పట్ల ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. బిల్లుపాడు గ్రామంలో నిర్మించిన సెవెంత్డే చర్చ్ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తల్లాడ సొసైటీ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.