సత్తుపల్లి రూరల్, సెప్టెంబర్ 28: మహిళా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అందుకే అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరుతో అందిస్తున్నట్లు చెప్పారు. అద్భుత పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. మండలంలోని 589 మందికి మంజూరైన గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ను సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో 9వేల మందికి పైగా గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారిలో మొదటి విడతగా సగం మందికి మంజూరు పత్రాలు అందజేస్తున్నామని వివరించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డా హైమావతి, కూసంపూడి మహేశ్, కూసంపూడి రామారావు, తుమ్మూరు శ్రీరామప్రసాద్, చిలుకుర్తి కృష్ణమూర్తి, మట్టా ప్రసాద్, యాగంటి శ్రీనివాసరావు, తుమ్మూరు కృష్ణారెడ్డి, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, మోదుగు పుల్లారావు, కొడిమెల అప్పారావు, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, వాసు పాల్గొన్నారు.
పదేళ్లలో కనీవినీ ఎరుగని అభివృద్ధి
తల్లాడ, సెప్టెంబర్ 28: గడిచిన పదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రూ.కోట్లాది నిధులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. అయినప్పటికీ కాం గ్రెస్ నాయకులు కళ్లుండీ చూడలేని కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. తల్లాడ మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. రూ.35 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంగాపురం- నారాయణఫురం బీటీ రోడ్డుకు రూ.2.80 కోట్లు, మంగాపురం బీసీ కమ్యూనిటీ హాలుకు రూ.25 లక్షలు, గొల్లగూడెం ఎస్సీ కమ్యూనిటీ హాలుకు రూ.25 లక్షలు, తల్లాడ – అన్నారుగూడెం రోడ్డుకు రూ.6 కోట్లు, నారాయణపురం – కొడవటిమెట్ట బీటీ రోడ్డుకు రూ.5.5 కోట్లు, అంజనాపురం – మువ్వగూడెం రోడ్డుకు రూ.2.10 కోట్లు, నూతనకల్ – లోకవరం రోడ్డుకు రూ.7 కోట్లు, నూతనకల్లో ఎస్సీ కమ్యూనిటీ హాలుకు రూ.25 లక్షలు, నూతనకల్ – వెంగన్నపేట రోడ్డుకు రూ.10 కోట్లు కేటాయించి వాటితో నిర్మించనున్న బీటీ రోడ్లకు, కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపన చేశారు.
అనంతరం గంగిదేవిపాడు సొసైటీ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు రూ.60 లక్షలతో నిర్మించనున్న గోడౌన్ నిర్మాణానికి డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.వెయ్యి కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని, వాటిల్లో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. తల్లాడకే ఇప్పటి వరకు రూ.100 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. తల్లాడలో 47 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రాయల వెంకటశేషగిరిరావు, కూరాకుల నాగభూషణం, విజయకుమారి, అట్లూరి వీరబాబు, రవికుమార్, దొడ్డా శ్రీనివాసరావు, హేమలత, రాంబాబు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, భద్రరాజు, శ్రీదేవి, ఉమా, పొట్టేటి సంధ్యారాణి, తూము శ్రీనివాసరావు, శీలం కోటారెడ్డి, విద్యాసాగర్, కొమ్మినేని ప్రభాకర్రావు, బద్ధం కోటిరెడ్డి, దిరిశాల దాసురావు, కేతినేని చలపతి, నాయుడు శ్రీనివాసరావు, జొన్నలగడ్డ కిరణ్బాబు, కోడూరి వీరకృష్ణ, తూము వీరభద్రం, అయిలూరి ప్రదీప్రెడ్డి, వెంకటి, రాజశేఖర్రెడ్డి, నరసింహారావు, రామారావు, అంబేద్కర్, దూపాటి నరేశ్రాజు, గుండ్ల నాగయ్య పాల్గొన్నారు.