ఖమ్మం, ఏప్రిల్ 18: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఖమ్మంలోని ముస్లింలకు ప్రభుత్వం తరఫున గురువారం ఖమ్మంలోని సీక్వెల్లో జిల్లా అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హాజరుకానున్నారు. వీరితోపాటు కలెక్ఱర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా హాజరుకానున్నారు.
కాగా, సీక్వెల్లో జరుగుతున్న ఇఫ్తార్ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మధుసూదన్రావు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తదితరులు మంగళవారం పరిశీలించారు. అనంతరం ముస్లింలతో ఏర్పాటు చేసిన సన్మాహక సమావేశంలో అదనపు కలెక్టర్, మేయర్, సుడా చైర్మన్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు మాట్లాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు.