ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నది. భద్రాచలం, దుమ్ముగూడెం, పర్ణశాల, చర్ల మండలాల్లోని పలు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
పలు గ్రామాలకు నేటికీ రాకపోకలు కొనసాగడం లేదు. బుధవారం రాత్రి గోదావరికి వరద పొటెత్తనుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి నీటిమట్ట 60 అడుగులు దాటినా.. ఎదుర్కొనేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.