కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 3: పశ్చిమ బెంగాల్ – నేపాల్ సరిహద్దులోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న సందక్పు శిఖరాన్ని జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (ఈఎంఆర్ఎస్) గిరిపుత్రికలు అధిరోహించారు. సందక్పు శిఖరాన్ని అధిరోహించేందుకు ఎంపికైన ఏడుగురు సభ్యుల్లో కొత్తగూడెంలోని రామవరం, గుండాల ఏకలవ్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులు కొర్సా స్వప్న, సపావత్ కీర్తన ఉన్నారు. వీరిద్దరికీ బంగారు పతకం లభించింది.
జనవరి 6 నుంచి 24 వరకు ఈ శిఖర అధిరోహణలో వారు పాల్గొన్నారు. 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని సకాలంలో గత బృందాలకంటే వేగంగా వీరు అధిరోహించడంతో అధికారులు అభినందించారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు, నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు ఎంతో ధైర్యంతో సందక్పు శిఖరాన్ని అధిరోహించడం పట్ల సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది, ఐటీడీఏ ఏపీవో జనరల్, గురుకులాల ఆర్సీవో డేవిడ్రాజు అభినందించారు. గుండాల ఈఎంఆర్ఎస్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సపావట్ గీతాంజలి, దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన కొర్సా స్వప్న ఈ పర్వతాన్ని అధిరోహించింది.