కారేపల్లి, ఆగస్టు 07 : ఖమ్మం జిల్లా మైనార్టీ నాయకుడు, బీఆర్ఎస్ సింగరేణి మండల నాయకుడు ఎస్కే గౌసుద్దీన్ గురువారం మాజీ మంత్రి కేటీఆర్కు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గౌసుద్దీన్ వైరా నియోజకవర్గ సమస్యలు, పార్టీ పరిస్థితులపై కేటీఆర్ కు వివరించారు. అదే విధంగా ఇంజినీరింగ్ చదువుతున్న తన కుమార్తె షేక్ మదీనా కౌసర్కు మెస్ ఫీజు చెల్లిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చి లాప్టాప్ అందజేసినట్లు గౌసుద్దీన్ తెలిపారు.