తిరుమలాయపాలెం, మే 21: పిండిప్రోలులోని గంగమ్మ ఆలయంలో శనివారం ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వేడుకలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా హాజరై పూజలు నిర్వహించారు.
పూజల్లో డీసీసీబీ మాజీ చైర్మన్ విజయ్బాబు, ఎంపీపీ బోడ మంగీలాల్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా శివరామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్లు చావా వేణు, ఇంటూరి శేఖర్, ఎంపీటీసీ పులుగుజ్జు వెంకటేశ్వర్లు, సొసైటీ వైస్ చైర్మన్ చామకూరి రాజు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు పరికపల్లి శేఖర్, రేపాకుల రవి, పసలాది ముత్తయ్య, నాయకులు దూదిమెట్ల శ్రీను, తాతా రవీందర్, చామకూరి కిరణ్, చిట్టి, వెంకటేశ్వర్లు, శరత్, తాతా మనోజ్ తదితరులు పాల్గొన్నారు.