పెనుబల్లి : జాతిపిత మహాత్మగాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా వీయం బంజరు రింగు సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం అహింసే ఆయుధంగా ఎంచుకున్న మహానుభావుడి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ రమాదేవి, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, జడ్పీటీసీల జిల్లా ఫోరం కన్వీనర్ చెక్కిలాల మోహన్రావు, ఏఎంసీ ఛైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్రావు, సీడీసీ ఛైర్మన్ ముక్కర భూపాల్ రెడ్డి, సర్పంచ్లు తేజావత్ తావూనాయక్, భూక్యా పంతులి, మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, ఎంపీటీసీలు చీపు లక్ష్మీకాంతం, వంగా ఝాన్సీ, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మందడపు అశోక్కుమార్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కనగాల సురేష్బాబు, నిరంజన్ గౌడ్, పసుమర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.