సత్తుపల్లి టౌన్, జనవరి 7 : సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో క్రీడల అభివృద్ధికి యువతకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. సత్తుపల్లిలో వీఆర్ క్రికెట్బాక్సును ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంత యువతలోని నైపుణ్యాలను అభివృద్ధి పర్చడానికి ఇలాంటి ఆడిటోరియంల అవసరం ఎంతైనా ఉందన్నారు. వీఆర్ క్రికెట్ బాక్సును ఏర్పాటు చేసిన జనకనూరి విరించిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను జనకనూరి దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో సింగరేణి వోసీ పీవో వెంకటాచారి, కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నర్సింహారావు, గాదె చెన్నకేశవరావు, కమల్పాషా, గోలి శ్రీనివాసరెడ్డి, పింగలి సామ్యేలు, సరోజిని తదితరులు పాల్గొన్నారు.