వేంసూరు, ఏప్రిల్ 5: వరి పంట వేయకుండా పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల రైతులకు సూచించడం చూస్తుంటే.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో బాబూ జగ్జీవన్రాం విగ్రహావిషరణ అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను మోసం చేయకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సన్నవడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, బోనస్ పకన పెడితే కనీసం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకుండా చేసిందని ఆరోపించారు. మిల్లర్లతో కుమ్మకై ధాన్యం ధరలను తగ్గించారని, రైతులు క్వింటాల్కు రూ.500 వరకు నష్టపోతున్నారని తెలిపారు. మొకజొన్న పంటకు కొనుగోలుదారులు లేకపోవడంతో రైతులు క్వింటాల్కు రూ.800 వరకు నష్టాన్ని చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని, కొనుగోలు కేంద్రాలను నామమాత్రంగా నిర్వహించాలని ఆదేశాలు ఇస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు రైతుభరోసా కూడా పూర్తిస్థాయిలో అందించలేదని మండిపడ్డారు. రైతుల సమస్యలను వెంటనే పరిషరించి, మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.