కల్లూరు, సత్తుపల్లి, డిసెంబర్ 8 : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెంటనే కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం కల్లూరు పట్టణంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందుబాటులో ఉండి బీఆర్ఎస్ విజయానికి కృషిచేస్తానని అన్నారు. సమావేశంలో కట్టా అజయ్బాబు, రెడ్డెం వీరమోహనరెడ్డి, దొడ్డా శ్రీనివాస్, లక్కినేని రఘు, దుర్గాప్రసాద్, పెద్దబోయిన మల్లేశ్వరరావు,బొప్పన రామారావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, డిసెంబర్ 8 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ సరస్వతీ ఆలయంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు, ఓయూ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు, యాదాద్రి నర్సింహస్వామి దీవెనలతో త్వరగా కోలుకుని ప్రజలకు సేవలందించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర అన్నారు.
తల్లాడ, డిసెంబర్ 8 : నియోజకవర్గ ప్రజలు, అభిమానులతోనే నా పయనమని, ఎల్లప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటానని మాజీఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం జరిగిన ముఖ్యకార్యకర్తలు, నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు రాజకీయ వివక్ష లేకుండా అందరికీ అందేలా కృషి చేశానని, ప్రస్తుత ప్రభుత్వం కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని ఆశీస్తున్నానన్నారు.
పరామర్శ : తల్లాడలో బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం పరామర్శించారు. కార్యక్రమంలో ఎంఈ వో దామోదరప్రసాద్, నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, దూపాటి భధ్రరాజు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్రెడ్డి, గుండ్ల వెంకటి, నాగయ్య, రఘు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.