సత్తుపల్లి టౌన్, ఏప్రిల్ 9: పట్టణంలోని ప్రధాన ప్రసాద్ జామియా మసీద్లో ముస్లింలకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇచ్చిన ఇఫ్తారు విందులో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని రాజీవ్నగర్, కాకర్లపల్లి, వేంసూరు రోడ్లోని రైతుబజార్,
ఎన్టీఆర్ కాలనీలోని మసీద్తో పాటు వెంగళరావునగర్లోని మదర్సా, వెంగళరావునగర్ మసీద్లోని ముస్లింలకు పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జామియా మసీద్ సదర్ ముకరం, మాజీ సదర్ మున్వర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రఫీ, లారీ అసోసియేషన్ నాయకులు మౌలాలి, మస్తాన్, సలీమ్ మాస్టారు, షాకీర్, ముక్తార్, నాయకులు దొడ్డా శంకర్రావు, కౌన్సిలర్ వేములపల్లి మధు పాల్గొన్నారు.