టేకులపల్లి, మే 24 : సమస్యలపై ప్రశ్నించే గొంతుక రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. రాకేశ్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం సులానగర్, బిల్లుడుతండా, కొండంగలబోడు, మద్రాస్తండా తదితర గ్రామాల్లో సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు వరప్రసాద్గౌడ్లతో కలిసి ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు జర్పుల లచ్చనాయక్ పాల్గొన్నారు.