ఖమ్మం/ ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 1: బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పరామర్శించారు. 58, 59 జీవోల దుర్వినియోగం అభియోగం కేసులో ఇటీవల జైలుకు వెళ్లిన పగడాల నాగరాజుకు గురువారం బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన ఖమ్మంలోని తన ఇంటికి చేరుకోవడంతో మాజీ మంత్రి అజయ్ సహా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. మాజీ మంత్రి అజయ్.. నాగరాజును పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ‘జై పువ్వాడ’ అంటూ నినాదాలు చేశారు.
అంతకుముందు జిల్లాలో జైలులోనూ పగడాల నాగరాజుతో మాజీ మంత్రి అజయ్ ములాఖత్ అయ్యారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఉన్న ఆయననను పార్టీ నాయకులు, న్యాయవాదులతో వెళ్లి ములాఖత్ ద్వారా కలిశారు. కేవలం కక్షపూరితంగానే ఈ కేసులో ఇరికించారని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి భరోసా కల్పించారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, కూరాకుల వలరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు కొత్త వెంకటేశ్వర్లు, బిచ్చాల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని పలు కుటుంబాలను కూడా మాజీ మంత్రి అజయ్ పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకురాలు కొల్లు పద్మ మామ కొల్లు కృష్ణయ్య, ప్రముఖ న్యాయవాది మల్లాది వాసుదేవ్ తల్లి మల్లాది ప్రభావతి, కనకం జనార్దన్ సతీమణి కనకం శారదలు ఇటీవల మృతిచెందగా గురువారం వారి ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబాలను పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్లు, నాయకులు జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటి, కూరాకుల వలరాజు, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, సాయి, కోడెం తార, ఎడేళ్లి భిక్షం, మల్లేశ్, మణికుంఠ తదితరులు పాల్గొన్నారు.