ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 10: పంట పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. సరైన అవగాహన లేకపోతే అనర్థాలూ తప్పవని హెచ్చరిస్తున్నారు. పంట పొలాలకు సోకిన చీడపీడల నివారణ కోసం రైతులు పురుగుమందులను పిచికారీ చేస్తుంటారు. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వారు అనారోగ్యాల పాలవుతున్నారు. కొంతమంది రైతుల ప్రాణాలు పోయిన ఘటనలూ ఉన్నాయి. రసాయనిక మందుల వినియోగం పెరిగిపోవడం, మందుల్లో మోతాదు పెరగడం, అందుకు తగ్గట్టుగా రైతులు రక్షణ చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల అనేక అనర్థాలు ఎదురవుతున్నాయి. వారితోపాటు వారికి సహాయకులుగా ఉన్న కుటుంబ సభ్యులూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏ మందు ఎలా వాడాలి? పిచికారీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..