భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణిలో బాధితులు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటి పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తుదారులను వివరాలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నవభారత్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్లో నెలకొన్న సమస్యలపై, పాల్వంచ మండలం బసవతారకం కాలనీకి చెందిన లలిత, చర్ల మండలం కుదునూరుకు చెందిన ఎస్.రజిని దరఖాస్తులు సమర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్రాజు, డీఆర్వో రవీంద్రనాథ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.