భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): అన్నివసతులతో కొత్తగూడెం మెడికల్ కాలేజీ రూపుదిద్దుకున్నది. అతి త్వరలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. వచ్చే నెల 15 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కాలేజీ పరిధిలో మొత్తం 150 సీట్లు ఉండగా నేషనల్ కోటాలో 15 శాతం, రాష్ట్రం నుంచి 85 శాతం సీట్లు భర్తీకానున్నాయి. మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చింది. కాలేజీ పరిధిలో ఇటీవల పక్షవాతానికి గురైన ఓ వ్యక్తి వైద్యం చేశారు. కేవలం ఐదు రోజుల్లోనే బాధితుడిని కోలుకునేలా చేసి ప్రజలతో శెభాష్ అనిపించుకున్నారు.
కాలేజీలో తొలి అడ్మీషన్ను కేరళకు చెందిన శ్రేయా నాయర్ అనే విద్యార్థిని నేషనల్ కోటాలో అడ్మీషన్ పొందింది. గురువారం అడ్మీషన్ పత్రాన్ని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అందజేశారు. వారి వెంట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, ఆసుపత్రి సూపరిండెంటెండ్ కుమారస్వామి, ఆర్అండ్బీ ఈఈ బీమ్లా, డాక్టర్ శ్రీకాంత్ ఉన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలో మొదటి సీటు పొందిన విద్యార్థినికి ధ్రువపత్రాన్ని తన చేతుల మీదుగా ఇవ్వడం ఆనందాన్నిచ్చిందన్నారు. వచ్చే నెల నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం విద్యార్థినికి శ్రేయానాయర్కు అభినందనలు తెలిపారు.