ఖమ్మం : నగరంలోని శ్రీనివాస నగర్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ సుబ్రమణ్యేశ్వర సామిల్ దూగాడ మిషన్లో మంగళవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం ఫైర్ స్టేషన్ అగ్నిమాపక అధికారి రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస నగర్లో తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్యూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని రెండు ఫైరింజన్లలతో సిబ్బంది మంటలను ఆర్పి ప్రమాదాన్ని అదుపులోకి తీసుకోచ్చారు.
అదృష్టశావత్తు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ.4.5లక్షల కలప, యంత్రాలు కాలిపోయాయని తెలిపారు.