కారేపల్లి:ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి లకావత్ స్వప్నకు ఫ్యూర్, నారీశక్తి స్వచ్చంద సేవాసంస్థలు ఆర్థిక సహాయాన్ని అందజేశాయి. ఈసందర్భంగా కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రిన్సిపాల్ మీటకోటి సింహాచలం మాట్లాడుతూ ఈనెల 29నుంచి జనవరి 2వతేదీ వరకు నేపాల్లో జరగనున్న అంతర్జాతీయ కబడ్డీ పోటీలలో భారత జట్టు నుంచి స్వప్న ప్రాతినిద్యం వహించనున్నదన్నారు.
గ్రామీణ గిరిజన పేద కుటుంబానికి చెందిన స్వప్న నేపాల్ వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవటంతో ప్రిన్సిపాల్ సింహాచలం, బోధన సిబ్బంది, ఏపూరి లక్ష్మినారాయణ సహకారంతో ప్యూర్ స్వచ్చంద సేవా సంస్థ దృష్టికి తీసుకువెళ్లగా రూ.20వేలు. నారీశక్తి స్వచ్చంద సంస్థ రూ.5వేలతో పాటు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రూ.2వేలు, సూర్యాపేట నెమ్మికల్ జూనియర్ లెక్చరర్ ఎస్.కే.జాన్ పాషా వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.