మామిళ్లగూడెం, ఫిబ్రవరి 26 : వివిధ సమస్యలపై బాధితులు చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఎస్హెచ్వోలను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 22 మంది బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులను అందించారు. వాటిని పరిశీలించిన సీపీ చర్యలు తీసుకునేందుకు ఆయా పోలీస్స్టేషన్లకు పంపించారు. ఎక్కువగా వ్యక్తిగత, కుటుంబ సమస్యలతోపాటు ఆర్థిక లావాదేవీలు, భార్యాభర్తల సమస్యలపై ఫిర్యాదు వచ్చాయని తెలిపారు.