ఖమ్మం : టీ.ఎన్.జి.వో కార్యాలయంలో మాదిగ హక్కుల దండోరా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టీ.ఎన్.జి.వో ఖమ్మం జిల్లా అధ్యక్షులు అఫ్జల్ హసన్ ను, జిల్లా కార్యదర్శి ఆర్వి సాగర్ ను, జిల్లా నాయకులు నందగిరి శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాదిగ, వైరా నియోజకవర్గ ఇంచార్జ్ దుప్పేల్లి శ్రీనివాస్ మాదిగ, ఇల్లందు నియోజక వర్గ ఇంచార్జ్ సగుర్తి కోటేశ్వరావు మాదిగ, కనకపూడి వీరస్వామి మాదిగ, ఖమ్మం నియోజవర్గ ఇంచార్జ్ భరత్ మాదిగ, చంద్రశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.