కారేపల్లి, ఫిబ్రవరి 8 : విద్యార్థుల చదువులపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి(డీఐఈవో)రవిబాబు సూచించారు. ప్రభుత్వ జజూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేసి మాట్లాడారు. అనంతరం కేజీబీవీ, తెలంగాణ మోడల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్, బోధన సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా అవగాహన కల్పించాలన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. సిలబస్ను బోధించి మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. నూరు శాతం విద్యార్థులు కళాశాలలకు హాజరయ్యేలా దోహదపడాలన్నారు. ఆత్మహత్యలు, మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్స్ మీటకోటి సింహాచలం,జి.ఝాన్సీసౌజన్య, ఎం డీ అక్తర్, బోధన సిబ్బంది పాల్గొన్నారు.