కామేపల్లి, ఫిబ్రవరి 4 : బీసీ బాలికలకు పోస్ట్ మెట్రిక్ వసతి గృహం ఏర్పాటు చేయాలని కోరుతూ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు బృందం, సర్పంచ్ అజ్మీరా రాందాస్నాయక్ ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్కు శుక్రవారం ఇల్లెందులో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పోస్ట్ మెట్రిక్ వసతి గృహం ఏర్పాటు చేయాలని ఉన్నాతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఖమ్మం బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల హాజరు శాతం ఎక్కువగా ఉన్నందున కామేపల్లి మండల కేంద్రంలో బీసీ బాలికల వసతి గృహం ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు.