భద్రాచలం, మే 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో 292 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్సీసా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. కారులో గంజాయిని తరలిస్తున్నరన్న విశ్వసనీయ సమాచారంతో శనివారం తెల్లవారుజామున కూనవరం రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రిజిస్ట్రేషన్తో ఉన్న కారు అతివేగంగా ఆపకుండా వెళ్లడంతో సీఐ, సిబ్బంది సినీ ఫక్కీలో ఛేజ్ చేశారు.
ఛేజింగ్లో ఎక్సైజ్ వాహనం ముందు భాగం దెబ్బతిన్నది. చేజ్లో నిందితులు కారును వదిలి పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ఆలీమ్, నరేందర్, జమాల్, కానిస్టేబుళ్లు వీరబాబు, నాగేశ్వరరావు, బాబు, స్రవంతి, లలిత పాల్గొన్నారు.పోలీసులు స్వాధీనపర్చుకున్న కారు, గంజాయి