ఖమ్మం : ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులు బుధవారం పరిశీలించారు.
హైదరాబాద్ స్థపతి వల్లి నాయగన్, కార్యనిర్వహక ఇంజినీర్ మల్లికార్జున్రెడ్డి, అసిస్టెంట్ స్థపతి గణేషన్, ఖమ్మం జిల్లా సహాయక ఇంజినీర్ మోహన్రావులు ఆలయ పరిసరాలను పరిశీలించి పలుసూచనలు చేశారు.
శ్రీవారి కళ్యాణ మండపాన్నిసత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు. ధార్మిక భవనం నిర్మాణ స్థలం పరిశీలించి ప్రస్తుతం ఉన్న భవనాన్ని తొలగించి దాతచే నూతన భవన నిర్మాణానికి అంగీకరించారు. స్వాగత తోరణ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కొత్తూరి జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్, సైట్ఇంజినీర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.