పాల్వంచ/ మణుగూరు టౌన్, జూలై 17 : నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో రెండు ప్లాంట్ల ప్రైవేటీకరణ వద్దంటూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్లో చేపట్టిన నిరసనలు శుక్రవారం 21వ రోజుకు చేరాయి.
వైటీపీఎస్లోని ఏహెచ్సీ, సీహెచ్పీ విభాగాలను ప్రైవేటీకరించే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో ఉద్యోగులు నినాదాలు చేస్తూ, నిరసన ప్రదర్శన చేపట్టారు. మణుగూరు బీటీపీఎస్లో ప్రధాన గేటు ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో రాజేందర్, యస్మిన్, కరుణాకర్రెడ్డి, ఉమామహేశ్వరరావు, బ్రహ్మాజీ, మడకం శ్రీనివాసరావు, రాజేశ్, గిరిధర్, అఖిల్, మధుబాబు, మహేశ్, రఘువీర్, డోలి శ్రీనివాసరావు, రాధాకృష్ణ, రవిప్రసాద్, నరేశ్, మహేశ్, ప్రసాద్, కృష్ణ, శోభన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.