మామిళ్లగూడెం, ఫిబ్రవరి17 : వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చేపట్టిన ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్(ఎఫ్ఎల్సీ) విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శనివారం నూతన కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గోడౌన్ను కలెక్టర్ సందర్శించారు. వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవల్ చెకింగ్లో తిరసరణకు గురైన ఈవీఎంలను మరమ్మతుల కోసం ఆ సంస్థకు ఎసార్ట్ భద్రతతో తరలించారు. తిరసరణకు గురైన ఈవీఎంలు కంపెనీకి వెళ్లే వరకు మార్గమధ్యలో వాహనాలను ఎక్కడ కూడా ఆపొద్దని సదరు బాధ్యులను కలెక్టర్ ఆదేశించారు.
గోడౌన్లో ఎఫ్ఎల్సీ అనంతరం భద్రపరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్ల గదుల తాళాలు, సీళ్లను పరిశీలించారు. సీసీ టీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. భద్రతా సిబ్బంది సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వసతుల గురించి అడిగారు. భద్రతాపరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ హుస్సేన్, వివిధ పార్టీల ప్రతినిధులు నల్లమోతు తిరుమలరావు, జీఎస్ఆర్ఏ విద్యాసాగర్, చీకటి రాంబాబు, సింగు రాజయ్య, పాలడుగు కృష్ణప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.