పెనుబల్లి: జాతీయ స్థాయి క్రికెట్కు ఎంపికైన క్రీడాకారునికి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, నాయకులు సోమవారం ఆర్థికసహాయాన్ని అందించారు. మండలపరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన వర్ధిబోయిన యశ్వంత్ ఇటీవల జాతీయస్థాయి క్రికెట్కు ఎంపికయ్యాడు. ఈ నెల 29న సూరత్లో జరగబోయే క్రీడల్లో పాల్గొనేందుకుఅవసరమైన డబ్బును సమకూర్చేందుకు పలువురు దాతల నుంచి విరాళాలు సేకరించారు.
మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, సర్పంచ్ కనగాల జయలక్ష్మీ, ఎంపీటీసీ కనగాల సురేష్బాబు, ఉపసర్పంచ్ తీగల వెంకటేశ్వరరావులు నగదు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం చాలా సంతోషకరమని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని విజయం దిశగా పయనించాలని వారు ఆకాంక్షించారు.