ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 8 : గంజాయి, డ్రగ్స్ వంటి వాటితో జీవితాలను నాశనం చేసుకోవద్దని నగర ఏసీపీ ఆంజనేయులు సూచించారు. నగరంలోని బొమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో మాదకదవ్యాల నివారణకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, చెడు మార్గాలవైపు పయనించొద్దని హితవు పలికారు. గంజాయి కేసుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దన్నారు. సదస్సులో కళాశాల చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్, అర్బన్ సీఐ, కళాశాల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రొహిబిషన్,ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కారేపల్లి మండల కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై రమణ మాట్లాడుతూ గ్రామాల్లో గంజాయి సాగు, సరఫరా చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతా మని అన్నారు. యువత చెడువ్యసనాలకు లోనై ఉజ్వలమైన భవిష్యత్ను నాశనం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిలక్కిశోర్తో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.