భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలులో ఉన్నందున కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల జిల్లా గ్రీవెన్స్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. కన్వీనర్గా జిల్లా సహకార అధికారి, డీఆర్డీవో, అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సరైన పత్రాలు, ఆధారాలు లేకుండా రూ.50 వేలకన్నా ఎక్కువ నగదును, అలాగే రూ.10 వేలకన్నా ఎక్కువ విలువైన వస్తు సామగ్రిని తీసుకొని ప్రయాణించవద్దన్నారు.
ఒకవేళ ఎక్కువ నగదుతో ప్రయాణించినైట్లెతే ఎఫ్ఎస్టీ/ఎస్ఎస్టీ/పోలీస్ అధికారులు ఎన్నికల నిబంధనల ప్రకారం సీజ్ చేస్తారని పేర్కొన్నారు. సీజ్ చేసిన నగదు విడుదల కోసం సదరు బాధితులు సరైన పత్రాలు, ఆధారాలతో జిల్లా సహకార అధికారి కార్యాలయం, ఎస్-1 బ్లాక్, సెకండ్ ఫ్లోర్, జిల్లా సమీకృత అధికారుల కార్యాలయంలోని జిల్లా గ్రీవెన్స్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వారు పూర్తి పరిశీలన చేసిన తర్వాత అది ఎన్నికలకు సంబంధించిన నగదు కాదని నిర్ధారించిన తర్వాత విడుదల చేస్తారని పేర్కొన్నారు. దీనిపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే 91001 15679 నంబర్కు కాల్ చేసి కమిటీ కన్వీనర్ను సంప్రదించాలని సూచించారు.