పోడు రైతుల ఎదురుచూపులకు తెరపడింది.. దశాబ్దాల కల నెరవేరింది.. సీఎం కేసీఆర్ చొరవతో వారి పోడు పట్టా చేతికొచ్చింది.. గత నెల 30న మంత్రులు హరీశ్రావు, అజయ్కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైన పట్టాల పంపిణీ కార్యక్రమం ఊపందుకున్నది.. పట్టాలు అందుకున్న పోడు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దశబ్దాల నుంచి భూమిని కాపాడుకోవడానికి యుద్ధం చేశామని, తమ గోడును గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదంటున్నారు. పోడు రైతుల కష్టాలు తీర్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడుతున్నారు.
కొత్తగూడెం టౌన్, జూలై 5 : ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పోడు పట్టాలిచ్చి గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగు నింపారని, వారి జీవితాలు మార్చిన దేవుడు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన సుజాతనగర్ మండలంలో వెయ్యి మంది గిరిజన ప్రజలకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ముందుగా మండల కేంద్రం నుంచి భారీ ర్యాలీతో ఎమ్మెల్యేకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోడు పట్టాలు పొందిన రైతులందరికీ రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడు సాగుచేసుకొని జీవిస్తున్న వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని, పోడు పట్టాలు అందుకున్న వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు.
కార్యక్రమంలో వనమా రాఘవేందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీ భూక్యా విజయలక్ష్మీ, తహసీల్దార్ సునీల్రెడ్డి, ఎంపీడీవో వెంకటలక్ష్మీ, ఏఎంసీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఆత్మకమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండె వీరహన్మంతరావు, మండల అధ్యక్షులు రెడ్డెం తులసిరెడ్డి, ఎంపీటీసీలు బత్తుల మానస, పెద్దమళ్ల శోశారాణి, మూడ్ గణేశ్, కో ఆప్షన్ మెంబర్ మీరాబి, సర్పంచ్లు రవి, కృష్ణ చైతన్య, హిరాని, హతీరాం, గంగా, సుజాత, లలిత, సీత, రాందాస్, సాంబయ్య, చంద్రకళ, రైతు బంధు కమిటీ కన్వీనర్ పెద్దమళ్ల నరేంద్రప్రసాద్, శివాలయం కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సంపు, బీఆర్ఎస్ నాయకులు ఎంఏ రజాక్, కాసుల వెంకట్, యూసుఫ్, రావి రాంబాబు, వేములపల్లి సత్యనారాయణ, బత్తుల రమేశ్, కొండా, తాళ్ల గురువారెడ్డి, గాజుల సీతారామయ్య, నరసింహా, సాంబయ్య, రాము, డైరెక్టర్ నెహ్రు, అమృతరావు, బాలాజీ నాయక్ పాల్గొన్నారు.