టేకులపల్లి, ఏప్రిల్ 5: ఆడబిడ్డల వివాహానికి మేనమామలా నేనున్నానంటూ వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో 93 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదింట్లో ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం సాయం అందజేస్తున్నదన్నారు.
చుక్కాలబోడు అంతర్గత రోడ్లు ప్రారంభం
చుక్కాలబోడు పంచాయతీలో అంతర్గత రోడ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని అన్నారు. ఎంపీపీ భూక్యా రాధ, సర్పంచులు ఈసాల ఉపేందర్బాబు, మాలోత్ సురేందర్, ఇర్పా లక్ష్మీనారాయణ, బానోత్ విజయ, భూక్యా ఇందిర, భూక్యా చిన్ని, భూక్యా గంగమ్మ, ఎంపీటీసీలు చింత శాంతకుమారి, భూక్యా బాలకృష్ణ, ఊకే రామకృష్ణ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ లక్కినేని శ్యామ్బాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్, బోడ బాలూనాయక్, చీమల సత్యనారాయణ, కంభంపాటి చంద్రశేఖర్రావు, బానోత్ కిషన్నాయక్, బానోత్ రవికుమార్, బర్మావత్ శివకృష్ణ, భూక్యా పాపా, భూక్యా సైదులునాయక్, మాలోత్ పూల్సింగ్, ఇస్లావత్ బాలూనాయక్, జాటోత్ నరేశ్, భూక్యా తావుర్యి, కొండబత్తుల శ్యామ్ పాల్గొన్నారు.
చుక్కాల బోడులో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ పంచాయతీ అయిన చుక్కాలబోడులో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులకు ఆకర్షితులైన గ్రామస్తులు బీఆర్ఎస్ జెండా దిమ్మెను ఏర్పాటు చేశారు. తొలి సారి ఉప సర్పంచ్ భూక్య లక్ష్మి ఇంటి ఎదుట బీఆర్ఎస్ పార్టీ దిమ్మె నిర్మించడంతో ఎమ్మెల్యే హరిప్రియ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అండగా ఉంటాని, ఈ ప్రాంత అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇందిరానగర్కు రూ.86వేలు మంజూరు
ఇల్లెందు రూరల్, ఏప్రిల్ 5: ఇందిరానగర్లోని ఒక వీధిలో సీసీ రోడ్డు, మంచినీటి పైప్లైనుకు ఎమ్మెల్యే హరిప్రియ రూ. 86వేలు నిధులు మంజూరు చేశారు. రెండు రోజుల క్రితం మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియకు గ్రామ సమస్యలపై ఇందిరానగర్ వాసులు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన ఆమె వెంటనే పంచాయతీ నిధు లు రూ.86వేలు మంజూరు చేశారు. గ్రామ స్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రమాద బీమా చెక్కు అందజేత
ఇల్లెందు రూరల్, ఏప్రిల్ 5: మండలంలోని పోలారం పంచాయతీ బొంబాయితండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కనుగోరి రవి ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందాడు. మృతుడికి పార్టీ సభ్యత్వం ఉండడంతో పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును బుధవారం ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందజేశారు. మండల అధ్యక్షుడు శీలం రమేశ్, ప్రధాన కార్యదర్శి రేణుక, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, నాయకులు కవిత, మల్సూర్, రాజశేఖర్, బాలు, సురేశ్, నాగేశ్, గాంధీ, కస్న, రాములు, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, సతీశ్, భీమా, దేవుల పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
టేకులపల్లి, ఏప్రిల్ 5: మండలంలోని సింగ్యాతండాకు భూక్యా దేవీలాల్, కోయగూడేనికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి మోక్కాళ్ల స్వామి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. సులానగర్ గ్రామానికి చెందిన పుష్ప రత్తయ్య, జంగం జాన్, కర్లపూడి రాహుల్ ఇటీవల మృతిచెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.