రఘునాథపాలెం, ఫిబ్రవరి 1: ఎంపీ నామా నాగేశ్వరరావు సిఫార్సుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఖమ్మంలోని ఎంపీ నామా క్యాంపు కార్యాలయంలో మంగళవారం 30 మంది లబ్ధిదారులకు ఆయన వాటిని అందజేసి మాట్లాడారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని అన్నారు. మధిర, వైరా నియోజకవర్గాల నాయకులు వాచేపల్లి లక్ష్మీరెడ్డి, ఉమాశంకర్, శకుంతల, పోట్ల శ్రీను, చిత్తారు సింహాద్రియాదవ్, బత్తుల శ్రీనివాసరావు, డేరంగుల బ్రహ్మం, కిశోర్ పాల్గొన్నారు.