ఖమ్మం : మహిళలకు రక్షణగా దిశ ప్రొటెక్షన్ కమిటీ పని చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షురాలు కావేటి రేవతి తెలిపారు. సోమవారం ఖమ్మం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో దిశ సంఘటన తరువాత 2016లో బాలికలు, మహిళలకు రక్షణగా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అందులో భాగంగానే వ్యవస్థాపకుడు బీవీ వెంకటేశ్వరరావు అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షురాలిగా రేవతి, ప్రధాన కార్యదర్శిగా పద్మ, ఉపాధ్యక్షురాలిగా రాజశ్రీ, సీతాకుమారిలను నియమించారు. ఈ కార్యక్రమంలో మల్లికా, నాగలక్ష్మి, మల్లీశ్వరి, సుకన్య తదితరులు పాల్గొన్నారు.